Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి ఖుష్బూ కళ్ళలో ఆనందం.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:34 IST)
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటి ఖుష్బూ. ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈమె తొలుత డీఎంకేలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.
 
ఇదిలావుంటే, మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడుస్తుంటాయి. పాత మిత్రులు విడిపోతే.. కొత్త మిత్రులు వచ్చి చేరుతుంటారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే, బీజేపీ - అన్నాడీఎంకేలు పోటీ చేయొచ్చు.
 
అయితే, ఈ పొత్తులు ఇంకా ఖరారు కాలేదు. కానీ ఖుష్బూ మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ఒక సర్వేలో డీఎంకే - కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలలో 36 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. 
 
ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రజలు ఎన్నుకోలేదని, ఆయనను బలవంతంగా రుద్దారని ఆరోపించారు. అదేవిధంగా అన్నాడీఎంకే అనే పార్టీకి మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెప్పాయని ఆమె గుర్తుచేశారు. 
 
ఈ పార్టీలతో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించుకున్న రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ చేతులు కలుపుతుందని జోస్యం చెప్పారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అంతకన్నా ఆనందం ఏముంటుందని ఆమె వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments