Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి : సంజయ్ రౌత్

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (18:33 IST)
ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వర్గం మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై శివసేన (యూబీటీ) సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ఈ అనూహ్య పరిణామాన్ని ఏక్‌నాథ్‌ షిండే తన సీఎం పదవి కోల్పోవడానికి నాందిగా ఆయన అభివర్ణించారు. త్వరలోనే మహారాష్ట్రకు కొత్త సీఎం వస్తారంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. 
 
ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం మహారాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన విషయం తెలిసిందే. 
 
ఈ పరిణామంపై ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. 'అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం ఏక్‌నాథ్‌ శిందే తన పదవిని కోల్పోయే ప్రక్రియ మొదలైనట్టే.. ఆయన వర్గం ఎమ్మెల్యేలు సభలో అనర్హతకు గురవుతారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా అజిత్‌ పవార్‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరారు' అని రౌత్‌ అన్నారు. 
 
ఈ పరిణామాన్ని ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌గా చూడరాదని.. రెండు ఇంజిన్లలో ఒకటి విఫలం కావడంతో వ్యాఖ్యానించారు. అయితే, ఈ పరిణామం గురించి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌కు తెలుసా అని విలేకర్లు ఆయన్ను ప్రశ్నించగా.. ఆయనకు మొత్తం సమాచారం ఉందంటూ రౌత్‌ బదులిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments