Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (15:27 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. గత 2016లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నియమించిన 25 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం బెంగాల్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేశాయి. ఈ వ్యవహారంపై బెంగాల్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, గట్టిదెబ్బ తగిలింది. ఈ కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పునిచ్చింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25 వేల టీచర్ నియామకాలు చెల్లవంటూ తీర్పునిచ్చింది. పైగా, గతంలో ఇదే కేసులో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ధర్మాసనం సమర్థించింది. 
 
కాగా, ఈ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌పై గత యేడాది ఏప్రిల్ నెలలో కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. 2016లో నిర్వహించిన స్టేల్ లెవల్ టెస్ట్ ద్వారా చేపట్టిన 25,753 టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. పైగా, దీనికింద ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులందరూ తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిన్నింటినీ కలిపి విచారణ జరిపిన సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments