Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు - స్కూల్స్ మూసివేత

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (15:57 IST)
వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ బెంబేలెత్తిస్తుంది. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, సోమవారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 
 
కరోనా కేసులు పెరిగిపోతుండటంతో విద్యా సంస్థలు, జూ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, బ్యూటీ పార్లర్లు, సెలూన్‌లను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. పరిపాలనా పరమైన సమావేశాలను కేవలం వర్చువల్ విధానంలో చేపట్టాలని బెంగాల్ ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. 
 
అలాగే, థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు 50 శాతం కెపాసిటీతో నిర్వహించుకోవాలని కోరింది. మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు 50 శాతం మందికి అనుమతి ఇచ్చింది. ఇక సమావేశాలకు 200 మంది, వివాహాది శుభకార్యాలకు 50 మందికి అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కాగా, కోల్‌కతాలో నే గత మూడు రోజుల్లో మూడు రెట్లు, బెంగాల్‌లో 5.47 శాతం కోవిడ్ పాజిటివిటీ రేటు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం