Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు - స్కూల్స్ మూసివేత

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (15:57 IST)
వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ బెంబేలెత్తిస్తుంది. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, సోమవారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 
 
కరోనా కేసులు పెరిగిపోతుండటంతో విద్యా సంస్థలు, జూ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, బ్యూటీ పార్లర్లు, సెలూన్‌లను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. పరిపాలనా పరమైన సమావేశాలను కేవలం వర్చువల్ విధానంలో చేపట్టాలని బెంగాల్ ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. 
 
అలాగే, థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు 50 శాతం కెపాసిటీతో నిర్వహించుకోవాలని కోరింది. మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు 50 శాతం మందికి అనుమతి ఇచ్చింది. ఇక సమావేశాలకు 200 మంది, వివాహాది శుభకార్యాలకు 50 మందికి అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కాగా, కోల్‌కతాలో నే గత మూడు రోజుల్లో మూడు రెట్లు, బెంగాల్‌లో 5.47 శాతం కోవిడ్ పాజిటివిటీ రేటు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం