Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్‌ఎక్స్ తీహార్ జైలుకు కార్తి చిదంబరం...

ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో తదుపరి దర్యాప్తు కోసం కార్తి చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం ముంబై తీసుకెళ్ళింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్త

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (15:04 IST)
ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో తదుపరి దర్యాప్తు కోసం కార్తి చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం ముంబై తీసుకెళ్ళింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తిని ఢిల్లీ సెషన్స్ కోర్టు గురువారం ఐదు రోజుల సీబీఐ కస్టడీకి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈనెల 6వ తేదీన కార్తీ చిదంబరంను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మండలి అనుమతులు రావడం వెనుక కార్తి చిదంబరం హస్తం ఉందని సీబీఐ ఆరోపించింది. ఆ సమయంలో ఆయన తండ్రి పి.చిదంబరం యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పని చేశారని తెలిపింది. సీబీఐ, ఈడీ కార్తిపై మరిన్ని కేసులు దాఖలు చేసే అవకాశం ఉందని ఓ వార్తా సంస్థ తెలిపింది. 
 
ఐఎన్ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జియా, కార్తి చిదంబరాలను ముంబైలో ఎదురెదురుగా పెట్టి సీబీఐ విచారణ జరుపుతుందని తెలుస్తోంది. పీటర్ ముఖర్జియా, కార్తి చిదంబరాలను కూడా ఇదేవిధంగా ప్రశ్నిస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments