Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దాడిని అవమానకరంగా భావించా.. అందే సర్జికల్ స్ట్రైక్స్ : మనోహర్ పారీకర్

మణిపూర్‌లో నాగాలాండ్‌ ఉగ్రవాదులు భారత ఆర్మీ కాన్వాయ్‌ మీద దాడిచేసి 18 మంది సైనికులను హతమార్చడాన్ని తాను తీవ్ర అవమానకరంగా భావించానని, అందుకే సర్జికల్‌ దాడులపై నిర్ణయం తీసుకున్నానని రక్షణ శాఖ మాజీమంత్రి

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (10:04 IST)
మణిపూర్‌లో నాగాలాండ్‌ ఉగ్రవాదులు భారత ఆర్మీ కాన్వాయ్‌ మీద దాడిచేసి 18 మంది సైనికులను హతమార్చడాన్ని తాను తీవ్ర అవమానకరంగా భావించానని, అందుకే సర్జికల్‌ దాడులపై నిర్ణయం తీసుకున్నానని రక్షణ శాఖ మాజీమంత్రి, గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ తెలిపారు. గోవాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. 
 
ముఖ్యంగా.. 2015 జూన్‌ 4న జరిగిన ఆ ఘటనతో తీవ్ర అవమానానికి గురయ్యానని, దాంతో పశ్చిమ సరిహద్దులలో సర్జికల్‌ దాడులు చేయాలని జూన్‌ 9న నిర్ణయం తీసుకుని, సుదీర్ఘ సన్నాహాల అనంతరం 2016 సెప్టెంబర్‌ 29న ఆ దాడులు చేశామని వెల్లడించారు. 
 
15 నెలల పాటు ప్రణాళికలు రచించి, అదనపు బలగాలకు శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సేకరించి మరీ ఈ దాడులు చేసినట్లు చెప్పారు. డీఆర్డీవో రూపొందించిన ‘స్వాతి వెపన్‌ లొకేటింగ్‌ రాడార్‌’ను తొలిసారిగా ఈ దాడుల్లోనే ఉపయోగించామని, దాని సాయంతోనే పాకిస్థానీ ఫైరింగ్‌ యూనిట్లను గుర్తించామన్నారు. 
 
కేవలం ఆ రాడార్‌ వల్లే పాక్‌ ఆర్మీకి చెందిన 40 ఫైరింగ్‌ యూనిట్లను ధ్వంసం చేయగలిగామన్నారు. భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో తాము చేసిన సర్జికల్‌ దాడులలో 70-80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments