Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దాడిని అవమానకరంగా భావించా.. అందే సర్జికల్ స్ట్రైక్స్ : మనోహర్ పారీకర్

మణిపూర్‌లో నాగాలాండ్‌ ఉగ్రవాదులు భారత ఆర్మీ కాన్వాయ్‌ మీద దాడిచేసి 18 మంది సైనికులను హతమార్చడాన్ని తాను తీవ్ర అవమానకరంగా భావించానని, అందుకే సర్జికల్‌ దాడులపై నిర్ణయం తీసుకున్నానని రక్షణ శాఖ మాజీమంత్రి

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (10:04 IST)
మణిపూర్‌లో నాగాలాండ్‌ ఉగ్రవాదులు భారత ఆర్మీ కాన్వాయ్‌ మీద దాడిచేసి 18 మంది సైనికులను హతమార్చడాన్ని తాను తీవ్ర అవమానకరంగా భావించానని, అందుకే సర్జికల్‌ దాడులపై నిర్ణయం తీసుకున్నానని రక్షణ శాఖ మాజీమంత్రి, గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ తెలిపారు. గోవాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. 
 
ముఖ్యంగా.. 2015 జూన్‌ 4న జరిగిన ఆ ఘటనతో తీవ్ర అవమానానికి గురయ్యానని, దాంతో పశ్చిమ సరిహద్దులలో సర్జికల్‌ దాడులు చేయాలని జూన్‌ 9న నిర్ణయం తీసుకుని, సుదీర్ఘ సన్నాహాల అనంతరం 2016 సెప్టెంబర్‌ 29న ఆ దాడులు చేశామని వెల్లడించారు. 
 
15 నెలల పాటు ప్రణాళికలు రచించి, అదనపు బలగాలకు శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సేకరించి మరీ ఈ దాడులు చేసినట్లు చెప్పారు. డీఆర్డీవో రూపొందించిన ‘స్వాతి వెపన్‌ లొకేటింగ్‌ రాడార్‌’ను తొలిసారిగా ఈ దాడుల్లోనే ఉపయోగించామని, దాని సాయంతోనే పాకిస్థానీ ఫైరింగ్‌ యూనిట్లను గుర్తించామన్నారు. 
 
కేవలం ఆ రాడార్‌ వల్లే పాక్‌ ఆర్మీకి చెందిన 40 ఫైరింగ్‌ యూనిట్లను ధ్వంసం చేయగలిగామన్నారు. భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో తాము చేసిన సర్జికల్‌ దాడులలో 70-80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments