Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రహాలపై కష్టాలు పడుతున్నా రక్షిస్తాం : దిమ్మదిరిగేలా రిప్లై ఇచ్చిన సుష్మా స్వరాజ్

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. విదేశాల్లో ఉంటూ కష్టాల్లో కూరుకున్న భారతీయులను రక్షించడంలో ముందుంటారు. ఇలాంటి బాధితులను మంత్రి ఆదుకున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్వి

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (18:33 IST)
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. విదేశాల్లో ఉంటూ కష్టాల్లో కూరుకున్న భారతీయులను రక్షించడంలో ముందుంటారు. ఇలాంటి బాధితులను మంత్రి ఆదుకున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఆమె చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.
 
కరణ్ సైనీ అనే నెటిజన్ సుష్మా స్వరాజ్‌ను ఉద్దేశించిన ఓ ట్వీట్ చేశారు. "నేను మార్స్‌పై చిక్కుకుపోయా. మంగళ్‌యాన్ ద్వారా మీరు పంపిన ఆహారం అయిపోయింది. మంగళ్‌యాన్-II ఎప్పుడు పంపిస్తారు?" అనేది ఆ ట్వీట్ సందేశం. 
 
ఈ ట్వీట్‌ను చూడగానే సుష్మా స్వరాజ్ కూడా తనదైనశైలిలో స్పందించారు. "భారతీయులు ఎక్కడ చిక్కుకున్నా భారత రాయబార కార్యాలయం సాయం చేస్తుంది. చివరికి గ్రహాలపైనైనా" అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆమె ట్వీట్ వైరల్ అయింది. 
 
అయితే, కరణ్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మంత్రితో జోకులేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాగా పనిచేసే మంత్రిపై ఇటువంటి అర్థంపర్థం లేని ట్వీట్లేంటంటూ మండిపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments