Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ఇళ్లకు వెళ్లం : రాకేశ్‌ తికాయత్‌

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (08:49 IST)
సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఇళ్లకు వెళ్లబోమని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) నేత రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు.

హర్యానాలోని చార్‌ఖీ దాద్రిలో నిర్వహించిన 'కిసాన్‌ మహా పంచాయత్‌'ను ఉద్దేశించి రాకేశ్‌ తికాయత్‌ ప్రసంగిస్తూ.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ కొనసాగుతోన్న అన్నదాతల ఆందోళన ప్రజా ఉద్యమమని, అది ఎప్పటికీ విఫలం కాబోదన్నారు.

రైతులకు మేలు చేయని ఈ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని ఆపబోమని, ఇళ్లకు వెళ్లబోమని తేల్చి చెప్పారు.

పంట ఉత్పత్తులకు మద్దతు ధర ఇచ్చేలా కొత్త చట్టాన్ని చేయడంతోపాటు ఇటీవల అరెస్ట్‌ చేసిన రైతు నేతలను విడుదల చేసే వరకు తాము ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదని రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments