Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయనాడ్‌లో శవాల్ దిబ్బగా మారిన గ్రామాలు... 256కు పెరిగిన మృతుల సంఖ్య!!

వరుణ్
గురువారం, 1 ఆగస్టు 2024 (10:33 IST)
ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని అనేక గ్రామాలు శవాల దిబ్బగా మారిపోయాయి. కొండ చరియలు విరిగిపడటం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 256కు చేరింది. మరో 220 మంది ఆచూకీ తెలియడం లేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా, సైనికులు ఇప్పటివరకు వెయ్యి మందిని రక్షించారు. 
 
ముఖ్యంగా, భారీ వర్షాల కారణంగా ముండక్కై, చూరమల, అత్తమల, నూల్‌పుళ గ్రామాల్లో మంగళవారం మూడుసార్లు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ మూడు గ్రామాలు శవాల దిబ్బలుగా మారిపోయాయి. కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకునిపోయాయి. ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. దాదాపు 1500 మంది ఆర్మీ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాలుపుంచుకుంటున్నారు. ఫోరెన్సిక్ సర్జన్లను కూడా మొహరించినట్టు కేరళ ఆరోగ్య శాఖ వీణాజార్జ్ తెలిపారు. 
 
బాధితులను రక్షించేందుకు చూరమలలో ఆర్మీ ఇంజనీర్ టాస్క్‌ఫోర్స్ బృందం తాత్కాలిక వంతెన నిర్మించింది. సహాయ కార్యక్రమాల్లో డాగ్ స్క్వాడ్‌లు కూడా పాలు పంచుకుంటున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేడు వయనాడ్‌ సందర్శిస్తారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోమారు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెచ్చరించింది. వయనాడ్‌తో పాటు ఇతర జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు, వయనాడ్ విలయంపై అమెరికా, రష్యా, చైనా, ఇరాన్ తదితర దేశాలు స్పందించాయి. మృతులపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments