Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వహస్తాలతో టీ కలిపి ఒబామాకిచ్చిన మోడీ.. వాక్ అండ్ టాక్!

Webdunia
ఆదివారం, 25 జనవరి 2015 (16:41 IST)
న్యూఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సపర్యలు చేస్తున్నారు. మహాత్మాగాంధీ సమాధికి అంజలి ఘటించిన తర్వాత హైదరాబాద్‌ హౌస్‌కు చేరుకున్న ఒబామాకు మోడీ చాలా కాలానికి స్వహస్తాలతో టీ కలిపారు. అలాగే మధ్యాహ్న భోజన సమయంలో ఒబామా పట్ల మోడీ అంతులేని ప్రేమ ఆప్యాయతలను కురిపించారు. 
 
అమెరికాతో పటిష్ట బంధాన్ని కోరుకుంటున్న భారత్, అందుకుతగ్గట్టుగానే స్పందిస్తున్నట్టు ఆయన అమెరికా అధ్యక్షుడికి సంకేతాలిచ్చారు. హైదరాబాద్ హౌస్‌లో 'వాక్ అండ్ టాక్' సందర్భంగా భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు పలు అంశాలపై చర్చించారు. 
 
ఈ సందర్భంగా ఒబామాకు మోడీ స్వయంగా ఛాయ్ కలిపి అందించారు. మోదీ పూర్వాశ్రమంలో ఛాయ్ వాలా అన్న సంగతి తెలిసిందే. టీని ఆస్వాదిస్తూ వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. కాగా, అమెరికాతో భారత్ ఎలాంటి బంధం కోరుకుంటుంది అనే అంశాన్ని మోడీ సూటిగానే చెప్పినట్టు తెలుస్తోంది. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments