Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపం కేసు : భయంగా ఉంది మమ్మల్ని కాపాడండి!: ప్రణబ్‌కు మెడికోలు లేఖ

Webdunia
గురువారం, 23 జులై 2015 (14:05 IST)
మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కామ్‌లో నిందితులుగా ఉన్న ఐదుగురు మెడికల్ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ స్కామ్‌లో తమ ప్రాణాలకు ముప్పు ఉందని మెడికో స్టూడెంట్స్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించారు. వీరంతా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో గ్వాలియర్‌కు చెందిన మనీష్ శర్మ, రాఘవేంద్ర సింగ్, పంకజ్ బన్సాల్, అమిత్ చద్దా, వికాస్ గుప్తలు రాష్ట్రపతికి లేఖను రాస్తూ, తమ ప్రాణాలను కాపాడాలని లేకుంటే ఆత్మహత్యకు అనుమతించాలని కోరారు. ఈ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని సిట్ తేల్చినప్పటికీ, కాలేజీ అధికారులు తమను వేధిస్తూనే ఉన్నారని లేఖలో ఆరోపించారు. 
 
రోజురోజుకీ తాము నరకంలో ఉన్నట్లు భావిస్తున్నామని, కేసులో నిందితులు విచారణ జరుపుతున్న అధికారులు సైతం ప్రాణాలు కోల్పోవడం చూసి భయంగా ఉందని వారు లేఖలో తెలిపారు. కాగా, వీరు చదువుతున్న కాలేజీలోనే రమణేంద్ర సింగ్ అనే వ్యాపమ్ నిందితుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇది ఆత్మహత్య కాదని, హత్యేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలకు ముప్పు వుందని, కాపాడాల్సిందిగా లేఖ రాశారు. 

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

Show comments