Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై ఆర్.కె.నగర్ బైపోల్ ఓటింగ్... బరిలో 59 మంది అభ్యర్థులు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (09:13 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్థానిక ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 
 
ఈ ఉప ఎన్నికలో భాగంగా 256 పోలింగ్‌ కేంద్రాల్లో  ఓటింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి మరుదుగణేశ్‌, అన్నాడీఎంకే అభ్యర్థి ఇ.మధుసూదన్‌, అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్‌, బీజేపీ నేత కరు నాగరాజన్‌‌లతో పాటు మొత్తం 59 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
 
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.28 లక్షలు. ప్రతి పోలింగ్‌ కేంద్రం దగ్గర 50 మంది పోలీసులు, 15 మంది పారామిలటరీ బలగాలు, 9 మంది చొప్పున ఐఏఎస్‌, ఐపీఎస్‌, నలుగురు ఐఆర్‌ఎస్‌ అధికారులను పర్యవేక్షణగా నియమించారు. 
 
నియోజకవర్గ వ్యాప్తంగా 200 సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. 75 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు విధుల్లో ఉన్నాయి. 45 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ భద్రతా సిబ్బంది కాకుండా, స్థానిక పోలీసులు కూడా పోలింగ్ భద్రతలో నిమగ్నమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments