Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్యత్వ పరీక్ష అంటే స్త్రీల గౌరవానికి భంగం కలిగించడమే : ఢిల్లీ హైకోర్టు

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (12:02 IST)
కన్యత్వ పరీక్షకు శాస్త్రీయత లేదని, ఒకవేళ అలాంటి పరీక్ష మహిళల గౌరవానికి భంగం కలిగించడమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షకు ఖచ్చితమైన శాస్త్రీయ, వైద్యపరమైన నిర్వచనమే లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు క్రైస్తవ సన్యాసి మృతి కేసులో కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. 
 
1992లో క్రైస్తవ సన్యాసిని (నన్) మృతి కేసు విచారణలో భాగంగా తనకు కన్యత్వ పరీక్షలు నిర్వహించాలంటూ సెఫీ అనే మరో నన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. 
 
"మహిళా నిందితులకు కన్యత్వ పరీక్షలు చేయడం దర్యాప్తులో భాగం కాబోదు. కస్టలో ఉన్న నిందితులకు కన్యత్వ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమే. ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా. ఇది ఆర్టికల్ 21 ఉల్లంఘనే" అని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ అభిప్రాయపడ్డారు. 
 
కన్యత్వ పరీక్షకు ఖచ్చితమైన శాస్త్రీయ, వైద్యపరమైన నిర్వచనే లేదని, అయినప్పటికీ ఈ పరీక్షలు మహిళల స్వచ్ఛతకు చిహ్నంగా మారిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మహిళలకు కన్యత్వ పరీక్షలు నిర్వహించడం అమానుషమన్నారు. సుప్రీంకోర్టులో కూడా ఈ పరీక్షలకు శాస్త్రీయత లేదని చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. 
 
ఇకపోతే కస్టోడియల్ డిగ్నిటీ అంశాన్ని ప్రస్తావిస్తూ, మహిళలు గౌరవంగా జీవించే హక్కుకు భంగం కలిగేలా ఎవరూ ప్రవర్తించినా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం