Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించి స్కూలుకు వచ్చిన టీచర్‌పై చెప్పులు విసిరిన విద్యార్థులు!

వరుణ్
బుధవారం, 27 మార్చి 2024 (09:08 IST)
స్కూలుకు మద్యం సేవించి వచ్చిన ఉపాధ్యాయుడిపై కొందరు విద్యార్థులు చెప్పులు విసిరారు. అతనిపై చెప్పులు విసురుతూ పాఠశాల ఆవరణం నుంచి బయటకు తరిమేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే ఓ టీచర్... ప్రతి రోజూ పాఠశాలకు మద్యం సేవించి వచ్చేవాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండ వారిని తిట్టడం ప్రారంభించాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థులు చెప్పులు విసిరారు. విద్యార్థుల దాడిని తట్టుకోలేక టీచర్ అక్కడి నుంచి పారిపోయాడు. 
 
కాగా, ఈ టీచర్ తరచూ స్కూలుకు తాగి వచ్చేవాడని విద్యార్థులు తెలిపారు. పాఠాలు చెప్పడం మానేసి తరగతి గదిలోనే ఓ మూల చాప వేసుకుని నిద్రపోయేవాడని అన్నారు. తమకు పాఠాలు చెప్పాలని పలుమార్లు వేడుకున్నా ఏమాత్రం పట్టించుకునేవాడు కాదని వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన విద్యార్థులు టీచర్‌కు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments