Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయకాంత్‌కు ఏమైంది? వీల్ ఛైర్‌లో ఎందుకొచ్చారు..?

Webdunia
సోమవారం, 28 జులై 2014 (14:17 IST)
డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఏమైంది అనేదే ప్రస్తుతం తమిళనాడు ప్రజల్లో మెదలుతున్న ప్రశ్న. విజయకాంత్ అనారోగ్యానికి గురయ్యారని.. సింగపూర్‌లో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో పాటు పార్టీలో కొంతమంది జంప్ జిలానీలు తయారుకావడం ఆయనను మనోవేదనను గురిచేసిందని తెలిసింది. 
 
కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆయన చికిత్స పొందారు. అనంతరం తన సతీమణి ప్రేమలతతో కలసి ఈనెల 13న సింగపూర్ వెళ్లారు. ఈ పర్యటన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. రెండు వారాల పాటు సింగపూర్‌లో ఉన్న కెప్టెన్ చెన్నైకి ఆదివారం తిరుగుప్రయాణం అయ్యారు. 
 
ఆదివారం ఉదయం 10.10కి సిల్క్ ఎయిర్ వేస్ విమానం చెన్నైలో ల్యాండ్ అయింది. అయితే కెప్టెన్ భార్య ప్రేమలత మాత్రమే తొలుత బయటకు వచ్చారు. విజయకాంత్ రాలేదని సూచించడానికే ఆమె ఒక్కరే బయటకు వచ్చారు. అయినా మీడియా అక్కడే వేచి ఉంది. కాసేపటి తర్వాత విజయకాంత్‌ను వీల్ ఛైర్ లో సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.
 
అతని శరీరంపై దుప్పటి కప్పి ఉంది. మీడియా కంటపడకుండా కారులోకి ఎక్కించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇదంతా మీడియాకు తెలిసిపోయింది. అయితే, విజయకాంత్‌కు ఏమయిందన్న విషయం పార్టీ వర్గాలకు కూడా తెలియని పరిస్థితి. విజయకాంత్‌కు సింగపూర్‌లో శస్త్రచికిత్స జరిగిందన్న వదంతులూ వ్యాపిస్తున్నాయి. వీల్ చెయిర్‌లో రావడంతో ఈ వదంతులకు బలం చేకూరుతోంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments