Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (17:03 IST)
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో మైనర్ బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెప్టెంబరు 7న ఇమాలియా సుల్తాన్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక మార్కెట్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఆమెను షీబు, నజీమ్ అనే ఇద్దరు యువకులు అనుసరించారు. నిర్మానుష్యం ప్రాంతంలోకి రాగానే ఆమెను సమీపంలోని చెరుకుతోటలోకి ఎత్తుకెళ్లారు. అక్కడ మరో ముగ్గురు ఉన్నారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై ఆ ఐదుగురు యువకులు లైంగికదాడి చేశారు. 
 
ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలికపై లైంగికదాడి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వీడియో వైరల్ కావడంతో బాధితురాలికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. వారు ధైర్యం చెప్పడంతో ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ వీడియో ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు శీబును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments