Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై వజ్రాలు ఏరుకున్న ప్రజలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (14:08 IST)
గుజరాత్ రాష్ట్రంలో కొందరు స్థానికులు నడి రోడ్డుపై వజ్రాలను ఏరుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఆసక్తికర సంఘటన వివరాలను పరిశీలిస్తే, గుజరాష్ట్రంలోని సూరత్‌లోని వరచ్చా అనే ప్రాంతం వజ్రాలకు ఎంతో ప్రసిద్ధి. 
 
ఇక్కడ వజ్రాల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ఓ వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను రోడ్డుపై పడేసుకున్నట్టు ఓ వార్త చక్కర్లు కొట్టింది. నడి రోడ్డుపై పడిపోయిన ఈ వజ్రాల విలువ కొన్ని కోట్ల రూపాయల్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. 
 
అంతే.. ఈ వార్తను తెలుసుకున్న స్థానికులు.. రోడ్డుపై పడిపోయిన వజ్రాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రోడ్డుపై అణువణువూ శోధించారు. దీంతో ఆ ప్రాంతమంతా జనాలతో రద్దీగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. 
 
కొందరికి కొన్ని వజ్రాలు కనిపించినా అవి ఇమిటేషన్ జ్యూవెలరీలో వాడే అమెరికన్ డైమండ్స్‌ అని తేలడంతో ఉసూరుమన్నారు. ఇది ఫ్రాంక్ అయి వుంటుందని మరికొందరు అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments