Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో హిందువులను 100 శాతం చేయడమే టార్గెట్ : ప్రవీణ్ తొగాడియా

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (14:25 IST)
భారత్‌లో హిందువులను 100 శాతంగా చేయడమే తమ లక్ష్యమని వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. ఒకపుడు ప్రపంచంలో హిందువులు మాత్రమే ఉండేవారని ఆయన గుర్తు చేశారు. కానీ, ఇపుడు హిందూ దేశమైన భారత్‌లో 82 శాతం మంది హిందువులు ఉన్నారని, ఈ సంఖ్యను వంద శాతానికి చేరుస్తామని తెలిపారు. 
 
దేశ వ్యాప్తంగా సాగుతున్న మతమార్పిడులపై తీవ్రమైన చర్చ, రచ్చ జరుగుతున్న నేపథ్యంలో తొగాడియా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపేలా ఉన్నాయి. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇండియాలో హిందువుల జనాభాను తగ్గించి మైనారిటీలుగా చేయాలన్న కుట్రలను అడ్డుకుంటామన్నారు. 
 
గతంలో కొందరి బలవంతంమీద మతాలను మార్చుకున్న వారు తిరిగి హిందూ మతంలోకి రావచ్చని, ఇందుకోసం 'ఘర్ వాపసి' పేరిట ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. కాగా, ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో 500 మంది గిరిజనులను హిందూ మతంలోకి మార్చినట్టు వీహెచ్‌పీ ప్రకటించిన విషయం తెల్సిందే. వీరంతా నిరుపేద క్రైస్తవులు, ముస్లింలుగా కొనసాగుతూ వచ్చారని ప్రకటించింది.a

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments