Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమాస్తుల కేసు రూ.100కోట్ల జరిమానా.. జయలలిత ఆస్తుల స్వాధీనం..?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె నెచ్చెలి శశికళ జైలు జీవనం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసుకు సంబంధించి కోర్టు రూ.100 కోట్లు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ

Webdunia
గురువారం, 10 మే 2018 (11:45 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె నెచ్చెలి శశికళ జైలు జీవనం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసుకు సంబంధించి కోర్టు రూ.100 కోట్లు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ జరిమానాను వసూలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జయలలిత ఆస్తుల స్వాధీనం చేసుకునే దిశగా అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 
 
కాగా 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఆదాయానికి మించిన రూ.66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో పాటు జయలలిత నిచ్చెలి శశికళ, ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా ఈ అక్రమాస్తుల వ్యవహారంలో సంబంధం ఉందంటూ కేసు నమోదైంది. సుమారు 20 సంవత్సరాలపాటు విచారణ జరిగిన ఈ కేసులో 2017 ఫిబ్రవరి 14వ తేదీన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
 
జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ నలుగురూ అక్రమాస్తులను కూడబెట్టినట్లు సుప్రీంకోర్టు నిర్ధారించింది. కానీ 2016లోనే జయలలిత మృతి చెందటంతో ఆమెకు రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు తలా నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. 2017లో కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌లో జయలలితకు విధించిన రూ.100 కోట్ల జరిమానాను వసూలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో నిందితులైన నలుగురి ఆస్తులను స్వాధీనం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసుకుంటోంది. 
 
ఇందులో తొలి విడతగా వారికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏఏ ఆస్తులు ఉన్నాయనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే 128 ఆస్తులను ప్రభుత్వం స్తంభింపజేసింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు చెందిన 68 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ప్రస్తుతం జయలలితకు విధించిన జరిమానాను వసూలు చేసే దిశగా అధికారులు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments