Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం పదవికి వసుంధరా రాజే రాజీనామా చేయరు : షా నవాజ్ హుస్సేన్

Webdunia
గురువారం, 2 జులై 2015 (14:38 IST)
వివాదాస్పద వ్యాపారి, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో సంబంధాలు కలిగివున్న కారణంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి వసుంధరా రాజే రాజీనామా చేయరని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ స్పష్టం చేశారు. తద్వారా వసుంధరా రాజేకు బీజేపీ హైకమాండ్ పూర్తి అండగా నిలబడినట్టయింది.
 
ఇదే అంశంపై ఆయన పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ వసుంధరా రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ప్రజలకు సేవచేయడం కొనసాగిస్తారని తెలిపారు. రాజస్థాన్‌ నుంచి కాంగ్రెస్‌ను పూర్తిగా తరిమికొట్టినందుకు ఆమె కంకణం కట్టుకున్నారన్నారు. అందువల్లే ఆమెపై కాంగ్రెస్ పార్టీ బురదచల్లడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. 
 
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజభవనాన్ని రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ సొంతం చేసుకున్నారన్న ఆరోపణల గురించి అడగ్గా, ఈ ఆస్తికి సంబంధించిన వివాదం కోర్టులో పరిష్కారమైందని, కోట్ల రూపాయల విలువైన ఆ ప్యాలెస్ దుష్యంత్‌దేనని కోర్టు సైతం తీర్పు ఇచ్చిందని షానవాజ్ చెప్పారు. కోర్టు దుష్యంత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఈ వ్యవహారంపై రాజకీయాలు ఎందుకు చేస్తోంది? అని ఆయన ప్రశ్నించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments