Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ మొత్తం ఇస్తే డీల్ సెటిల్ చేస్తానని వరుణ్ గాంధీ ఆఫరిచ్చారు: లలిత్ మోడీ

Webdunia
బుధవారం, 1 జులై 2015 (15:51 IST)
ఐపీఎల్ మాజీ ఛైర్మన్, వివాదాస్పద వ్యాపారి లలిత్ మోడీ తాజాగా మరో ట్వీట్ పేల్చారు. ఈ దఫా ఆయన బీజేపీ యువనేత వరుణ్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఈ ట్వీట్ చేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో తనకు ఎదురైన మొత్తం సమస్యల వ్యవహారం నుంచి గట్టెక్కించేందుకు 60 మిలియన్ డాలర్లను డిమాండ్ చేశారంటూ బాంబు పేల్చారు. ఈ ఆఫర్ లండన్‌లో వరుణ్ గాంధీ తనను కలిసినపుడు ప్రతిపాదించారని చెప్పారు. 
 
ఇదే అంశంపై లలిత్ మోడీ తాజాగా ఓ ట్వీట్ చేస్తూ వరుణ్ గాంధీని కూడా వివాదంలోకి లాగారు. వరుణ్ గాంధీ తనను కొన్నేళ్ల క్రితం లండన్‌లో కలిశారని, తన పెద్దమ్మ (సోనియాగాంధీ)తో మాట్లాడి మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు 60 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలని అడిగినట్టు చెప్పాడు. దీనికి సంబధించి ఇటలీలో ఉన్న సోనియా సోదరిని కలవాల్సిందిగా సూచించారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, లలిత్ మోడీ వీసా విషయంలో ఇప్పటికే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుధరా రాజేలను ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లండన్‌లో సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక, రాబర్ట్ వాద్రా, సినీ నటుడు షారుఖ్ ఖాన్‌లను కలిశానని ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేశాడు. మొన్న కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్‌ పేర్లను, ఇప్పడు వరుణ్ గాంధీ పేరుని తెరమీదకి తెచ్చాడు. 

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments