Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సాలో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (13:50 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కెందుజార్‌లో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఎనిమిది మంది చనిపోగా, మరో 12 మంది గాయపడ్డారు. 20వ జాతీయ రహదారి బలిజోడి సమీపంలో ఆగివున్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాను ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి కారణమైన వ్యాను డ్రైవర్ పరారీలో ఉన్నారు. 
 
ఈ ప్రమాదంలో గంజాం జిల్లాకు చెందిన రెండు కుటుంబ సభ్యులు తారిణిదేవి ఆలయ దర్శకానికి వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొట్టింది. తారిణి ఆలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 
 
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన 12 మందిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని కటక్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని కెందుజార్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments