Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రుల కోసం తనను అమ్మకానికి పెట్టుకున్న వడోదర మహిళ!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (17:24 IST)
వడోదరకు చెందిన ఓ మహిళ తనను తాను అమ్మకానికి పెట్టుకుంది. దీనికి కారణం కటిక దరిద్ర్యం. ఈ దరిద్ర్యం కొందరిలో పట్టుదల పెంచి ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తే.. మరికొందరిని దుశ్చర్యలవైపు తీసుకెళుతోంది. 
 
20 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి వడోదరకు చాందిని రాజ్‌గౌర్ అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి వడోదరకు చేరుకుంది. ఈమె తన ఫేస్ బుక్ ఖాతాలో తన ఫొటో అప్‌లోడ్ చేసి, దానికింద ఓ సందేశం ఉంచింది. తల్లిదండ్రులకు వైద్య చికిత్స చేయించేందుకు అవసరమైన డబ్బు కోసం తనను తాను అమ్ముకుంటున్నానని ఆ సందేశంలో పేర్కొంది. 
 
తల్లిదండ్రులు మంచాన పడడంతో వారి ఆలనాపాలన అంతా చాందినీయే కొన్నేళ్లుగా చూసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఓ జాతీయ మీడియా ఆమెను సంప్రదించగా, తనను తాను అమ్ముకోవడం తప్ప తనకు మరోమార్గం కనిపించలేదని, అందుకే అమ్మకానికి పెట్టుకున్నట్టు తెలిపింది. 
 
అంతేకాకుండా, వైద్య ఖర్చుల కోసం "నా తల్లిదండ్రుల కోసం నన్ను కొనండి" అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తమ ఇక్కట్లు తీరాలంటే తాను అమ్ముడవడం తప్ప మరోమార్గం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments