Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vadodara car crash: గుంతలున్నాయ్.. కారు అదుపు తప్పింది.. అందుకే ప్రమాదం..

సెల్వి
శనివారం, 15 మార్చి 2025 (15:36 IST)
గుజరాత్‌లోని వడోదరలో కారు బీభత్సానికి ఒక మహిళ మృతి చెందింది. గుజరాత్‌లోని వడోదరలో అర్థరాత్రి తాగిన లా విద్యార్థి ఒక మహిళ, ఆమె బిడ్డను చంపి, మరో ఏడుగురిని గాయపరిచాడు. గురువారం రాత్రి అతివేగంగా కారును నడిపిన రక్షిత్ చౌరాసియా ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు పక్కన ఉన్న 8 మంది గాయాల పాలయ్యారు.
 
ఈ ఘటనకు కారణమైన రక్షిత్ చౌరాసియాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే తాను మద్యం సేవించి వాహనం నడపలేదని పేర్కొన్నాడు. రోడ్డుపై ఉన్న గుంత కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని వివరించాడు. కారు టైరు గుంతలో పడటంతో అదుపుతప్పి.. పక్కనే ఉన్న స్కూటీని ఢీకొన్నట్లు తెలిపాడు. 
 
అదే సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకోవడంతో తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 50 కిలోమీటర్ల స్పీడుతోనే వెళ్తోందని వివరించాడు. తాను ఆ సమయంలో మద్యం సేవించి లేనని.. హోలికా దహనం కార్యక్రమానికి వెళ్లి వస్తున్నట్లు రక్షిత్‌ చౌరాసియా తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments