Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కళ్లెదుటే 30 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్... బైకుపై వెళుతుంటే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో 30 ఏళ్ల మహిళపై ఆమె కట్టుకున్న భర్త ఎదుటే నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తమ బిడ్డకు ఆరోగ్యాన్ని చె

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో 30 ఏళ్ల మహిళపై ఆమె కట్టుకున్న భర్త ఎదుటే నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తమ బిడ్డకు ఆరోగ్యాన్ని చెక్ చేయించుకునేందుకు భార్యాభర్తలు ఇద్దరూ ఆసుపత్రికి వెళ్లి వస్తున్నారు. మార్గమధ్యంలో వారి బైకును నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వారిని బైకు పైనుంచి కిందికి లాగి సమీపంలో వున్న చెరకు తోటలోకి తీసుకెళ్లారు. 
 
అక్కడ ఆమె భర్తను ఓ చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత మహిళపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. అలా అయితే పసిబిడ్డను చంపేస్తామని ఆమెను బెదిరించి బలవంతంగా ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఘటనా ప్రదేశంలో పసిబిడ్డ ఏడుపులు, మహిళ అరుపులను సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు విని పరుగు పరుగున వచ్చారు. కానీ అప్పటికే ఆ నలుగురు కామాంధులు పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం