Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్ : ప్రధాని మోడీపై ఉన్న అభిమానం ఓట్ల సునామీగా మారింది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఉన్న అభిమానం ఓట్ల సునామీగా మారి భారతీయ జనతా పార్టీని విజయతీరాలకు చేర్చింది. పర్వతాలు, గంగా, యమునా నదుల మధ్య కొలువుదీరి ఉన్న దేవ భూమిగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (16:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఉన్న అభిమానం ఓట్ల సునామీగా మారి భారతీయ జనతా పార్టీని విజయతీరాలకు చేర్చింది. పర్వతాలు, గంగా, యమునా నదుల మధ్య కొలువుదీరి ఉన్న దేవ భూమిగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీకి బాగా కలిసివచ్చింది.
 
దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృత స్థాయి ప్రచారం కాషాయ జెండా రెపరెపలకు కారణమైంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు, ఆ పార్టీ నుంచి మాజీ సీఎం విజయ్ బహుగుణ సారథ్యంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం హస్తవాసి క్షీణించిపోవడానికి మరో కారణంగా కనిపిస్తున్నది.
 
మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 36 సీట్లు. కానీ, ఈ ఎన్నికల్లో బీజేపీ ఆ మ్యాజిక్ సంఖ్యను దాటిపోయింది. బీజేపీకి 56 సీట్లు, కాంగ్రెస్‌కు 11, ఇతరులకు 2 సీట్లు చొప్పున రాగా, ఒక స్థానం ఫలితం రావాల్సి ఉంది. దీంతో ఈ రాష్ట్రంలో బీజేపీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments