Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌‍లో విద్యుత్ షాక్‌కు 15 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 19 జులై 2023 (19:56 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కరెంట్ షాక్ తగిలి 15 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. మృత్తుల్లో ముగ్గురు పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు హోం గార్డులు కూడా ఉన్నారు. చమోలీ జిల్లా అలకనందా నది ఒడ్డున నమామి గంగే ప్రాజెక్టు స్థలం వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఓ పంపింగ్ స్టేషన్‌ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో పక్కనే ఉన్న ఇనుప రైలింగ్‌కు విద్యుత్ సరఫరా అయింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ అదనపు డీజీపీ వి.మురుగేశన్ మాట్లాడుతూ, మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ప్రమాదవశాస్తు మరణించాడు. దీంతో బుధవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. వైద్యుల సాయంతో అక్కడే పంచనామా చేపట్టారు. ఆ సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. దీంతో ఇనుప రెయిలింగ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఇలా జరిగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని, దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments