భార్యను పూజ పేరుతో చెరువు వద్దకు తీసుకొచ్చి.. నీటిలో ముంచి చంపేసిన భర్త

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (16:25 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో ఓ దారుణం జరిగింది. తన భార్యను పూజ పేరుతో చెరువు వద్దకు తీసుకొచ్చిన భర్త.. చెరువు నీటిలో భార్యను ముంచి చంపేశాడు. ఇంటి నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి చెరువు వద్దకు పూజ కోసం వచ్చారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ, భార్యను నీటిలో ముంచి చంపేశాడు. 
 
పూజ కోసం చెరువు వద్దకు వచ్చిన భార్యాభర్తలు అక్కడ చాలా సేపు ఏదో విషయంపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ వాదనలో భర్త తన కోపాన్ని నియంత్రించుకోలేక చెరువు నీటిలో భార్యను ముంచేసి చంపేశాడు. దీన్ని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని ఆమెను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని తరానా బానోగా గుర్తించారు. ఆమె భర్తను మహ్మద్ ఆరిఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసుల ప్రాథమిక విచారణలో.. తారానా ఆరోగ్యం చాలా కాలంగా చెడిపోయిందని, నిందితుడు శనివారం తన అత్తమామల ఇంటికి చేరుకుని భార్యను భూతవేద్యం కోసం బరౌలికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో మద్యం సేవించివున్న ఆరిఫ్... భార్యతో గొడవపడి ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments