Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగి సర్కారు ఉక్కుపాదం.. 2వారాల్లో 64,128 లౌడ్ స్పీకర్ల తొలగింపు

Webdunia
సోమవారం, 9 మే 2022 (16:22 IST)
యోగి ఆదిత్యనాథ్ సర్కారు లౌడ్ స్పీకర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 
 
రెండు వారాల్లోనే భిన్న మత వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాల నుంచి అనుమతుల్లేని 64,128 లౌడ్ స్పీకర్లను తొలగించారు. అదే సమయంలో 57,352 లౌడ్ స్పీకర్ల వ్యాల్యూమ్‌ను తగ్గించారు. 
 
లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసిన చోట.. వాటి నుంచి వచ్చే శబ్దం అక్కడి ఆవరణ దాటి వినపడకూడదంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 
 
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అనధికారికంగా నడుస్తున్న లౌడ్ స్పీకర్లను తొలగించేంత వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. 
 
అత్యధికంగా బరేలీ ప్రాంతం నుంచి 17,287 లౌడ్ స్పీకర్లు తొలగించారు. ఆ తర్వాత మీరట్ నుంచి 11,769 లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments