Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కాపురానికి రాలేదనీ బావమరిదిని కిడ్నాప్ చేసిన భర్త...

భార్య కాపురానికి రాకపోవడంతో ఆగ్రహించిన భర్త... తన బావమరిదిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (09:51 IST)
భార్య కాపురానికి రాకపోవడంతో ఆగ్రహించిన భర్త... తన బావమరిదిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఫిరోజాబాద్ జిల్లా రసూల్‌పురా గ్రామానికి చెందిన సౌరభ్ (29), రత్నేష్ (27) అనే దంపతులు ఉన్నారు. ఈ భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు ఏర్పడుతున్నాయి. దీంతో భర్త వేధింపులను తట్టుకోలేక భార్య రత్నేష్ పుట్టింటికి వెళ్లి పోయింది. 
 
ఆ తర్వాత అత్తారింటికి వెళ్లిన సౌరభ్... కాపురానికి రాకుంటే తీవ్రపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించడమేకాకుండా తన బావమరిది దేవేంద్రను కిడ్నాప్ చేశాడు. బావమరిదిని కిడ్నాప్ అతన్ని తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న రత్నేష్ పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దేవేంద్రను ఢిల్లీ రైల్వేస్టేషనులో గుర్తించి కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. నిందితుడైన సౌరభ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments