Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో రెచ్చిపోయిన ఈవ్‌టీజర్లు.. ఇద్దరు మహిళలను వేధించిన పోకిరీలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో ఈవ్ టీజర్లు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళుతున్న తల్లీ, కూతుళ్లను వేధించారు. చేయిపట్టుకుని లాగారు. నెట్టారు. ‘మా దారిన మేం పోతున్నాం, వదిలేయండి మహాప్రభో’ అని వేడుకున్న

Webdunia
ఆదివారం, 28 మే 2017 (14:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో ఈవ్ టీజర్లు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళుతున్న తల్లీ, కూతుళ్లను వేధించారు. చేయిపట్టుకుని లాగారు. నెట్టారు. ‘మా దారిన మేం పోతున్నాం, వదిలేయండి మహాప్రభో’ అని వేడుకున్నా విడిచిపెట్టలేదు. చివరకు ఈ సమాచారం పోలీసులకు క్షణాల్లో చేరడంతో ఈవ్ టీజర్లు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రాంపూర్‌లో తల్లీకూతుళ్లు రోడ్డున నడిచి వెళుతున్నారు. ఆ సమయంలో 14 మంది యువకులు వారిని చుట్టిముట్టి వేధించసాగారు. వారిలోనే కొందరు అదో ఘనకార్యమైనట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఏ మాత్రం భయం లేకుండా అమ్మాయిల వెంట పడిన వారిలో పట్టుమని పదేళ్లు కూడా నిండని వారు కూడా ఉన్నారు. 
 
వీరిలో ఒకడైతే, ఏకంగా అమ్మాయిని ఎత్తుకుని పరిగెత్తబోయాడు. తమను విడిచి పెట్టాలని వారు బతిమాలుకున్నా వినలేదు. నవ్వుతూ, వారిపై చెత్త జోకులేస్తూ తాకరాని చోట తాకుతూ పైశాచికానందాన్ని పొందారు. రాంపూర్‌లోని ఓ పార్కులో జరిగిన ఘటన వీడియో వైరల్ కాగా, స్పందించిన పోలీసులు పోకిరీలను పట్టుకుని జైల్లో పెట్టారు. తమదైన పద్ధతిలో ఈవ్ టీజర్లకు దేహశుద్ది చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments