Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దెయ్యం పట్టిందనీ... శోభనం రాత్రి నవవధువుపై తాంత్రికుడు.. మరిది అత్యాచారం

కోటి ఆశలతో కొన్ని గంటల క్రితం మెట్టినింట్లో అడుగుపెట్టిన నవ వధువు తన భర్త తమ్ముడు (మరిది) చేతిలోనే అత్యాచారనికి గురైంది. నీ భర్తకు దెయ్యం పట్టింది.. అతనితో సంభోగంలో పాల్గొంటే చనిపోతావని బెదిరించి తాంత

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (13:31 IST)
కోటి ఆశలతో కొన్ని గంటల క్రితం మెట్టినింట్లో అడుగుపెట్టిన నవ వధువు తన భర్త తమ్ముడు (మరిది) చేతిలోనే అత్యాచారనికి గురైంది. నీ భర్తకు దెయ్యం పట్టింది.. అతనితో సంభోగంలో పాల్గొంటే చనిపోతావని బెదిరించి తాంత్రికుడితో కలిసి మరిది ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మీరట్ సమీపంలోని లిసారీ గేట్ ప్రాంతానికి చెందిన బాధితురాలికి హార్పూర్ జిల్లాలో వస్త్ర వ్యాపారితో ఈనెల 15వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అంటే శోభనానికి వెళ్లే ముందు ఆమెకు స్వల్పంగా మత్తుమందు కలిపిన పానీయాన్ని తాగించారు. 
 
ఆ తర్వాత శోభనం గదిలోకి మరిది, తాంత్రికుడు వచ్చి.. నీ భర్తకు దెయ్యం పట్టిందని, అతను చనిపోకుండా చూడాలని, ఇందుకోసం అతనితో సంభోగంలో పాల్గొనకుండా మరిదితో శోభనం చేయాలని, అప్పుడే భర్త బతుకుతాడని చెప్పి... మరిదితో కలసి తాంత్రికుడు కూడా అత్యాచారం చేశాడు. 
 
మరుసటి రోజు ఉదయం తెలివిలోకి వచ్చిన ఆమె, తల్లికి విషయం తెలిపింది. ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించగా, మీరట్ పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments