Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి ఝలక్ ఇచ్చిన ఉపేంద్ర : మంత్రి పదవికి గుడ్‌బై

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (15:02 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి ఒకరు తేరుకోలేని షాకిచ్చారు. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహ్ తన పదవికి రాజీనామా చేశారు. 
 
ఈయన బీహార్ రాష్ట్రంలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన నేత. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో పాటు దానిమిత్రపక్ష పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతోంది. ఈ సీట్ల పంపణీ సరిగాలేదని పేర్కొంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా కేంద్ర మంత్రిపదవికి కూడా రాజీనామా చేశారు. 
 
బీహార్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చామనీ, కానీ వాటిలో ఒక్కదాన్ని కూడా అమలుచేయలేకపోయమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రాజీనామా చేస్తున్న‌ట్లు త‌న లేఖ‌లో తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ పార్టీకి బీహార్ ఎంపీ సీట్ల‌లో కేవ‌లం రెండు సీట్లు మాత్ర‌మే కేటాయించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణ‌యించారు. దీంతో కేంద్ర‌మంత్రి ఉపేంద్ర ఎన్డీఏకు గుడ్‌బై చెప్పారు. అదేసమంయలో ఆయన సోమవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి మంతనాలు జరిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments