Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి ఝలక్ ఇచ్చిన ఉపేంద్ర : మంత్రి పదవికి గుడ్‌బై

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (15:02 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి ఒకరు తేరుకోలేని షాకిచ్చారు. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహ్ తన పదవికి రాజీనామా చేశారు. 
 
ఈయన బీహార్ రాష్ట్రంలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన నేత. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో పాటు దానిమిత్రపక్ష పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతోంది. ఈ సీట్ల పంపణీ సరిగాలేదని పేర్కొంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా కేంద్ర మంత్రిపదవికి కూడా రాజీనామా చేశారు. 
 
బీహార్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చామనీ, కానీ వాటిలో ఒక్కదాన్ని కూడా అమలుచేయలేకపోయమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రాజీనామా చేస్తున్న‌ట్లు త‌న లేఖ‌లో తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ పార్టీకి బీహార్ ఎంపీ సీట్ల‌లో కేవ‌లం రెండు సీట్లు మాత్ర‌మే కేటాయించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణ‌యించారు. దీంతో కేంద్ర‌మంత్రి ఉపేంద్ర ఎన్డీఏకు గుడ్‌బై చెప్పారు. అదేసమంయలో ఆయన సోమవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి మంతనాలు జరిపారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments