Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభలేఖలు పంచుతుండగా వధువు కిడ్నాప్... గ్యాంగ్ రేప్.. ఆపై విక్రయం

Webdunia
మంగళవారం, 10 మే 2022 (10:36 IST)
శుభలేఖలు పంచుతున్న వధువును ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఓ రాజకీయ నేతకు విక్రయించారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల 21వ తేదీన బాధిత యువతికి పెళ్లి జరగాల్సివుంది. ఇందుకోసం 18వ తేదీన శుభలేఖలు పంచేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆ యువతిని తమతోనే ఉంచుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత ఓ రాజకీయ నేతకు అప్పగించారు. ఆయన కొన్ని రోజుల పాటు బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియా జిల్లా పఠారి గ్రామంలోని మరో వ్యక్తి వద్దకు పంపించారు. అక్కడ నుంచి తప్పించుకుని బయటపడిన ఆ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి ఫిర్యాదుపై తక్షణం స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం