Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆ' సుఖానికి నిరాకరించింది.. అందుకే స్నేహితులతో కలిసిచంపేశా...

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (15:29 IST)
గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నామనీ, అయితే, తనతో శారీరకంగా కలిసివుండేందుకు తన ప్రియురాలు నిరాకరించడంతో తన స్నేహితులతో కలిసి చంపేసినట్టు ఓ హత్యాచార కేసులోని ప్రధాన నిందితుడు పోలీసులకు చెప్పాడు. 
 
ఈ హత్యాచార ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరాబంకి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బరాబంకి జిల్లాలో 17 ఏళ్ల మైనర్‌ యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.
 
ఈ క్రమంలో గత రెండు రోజులుగా కూతురు కనిపించకపోవడంతో ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు... ఆ యువతి ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని స్టేషన్‌కు పిలిచి విచారించగా అసలు విషయాన్ని వెల్లడించాడు.
 
యువతి, తాను గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నామని, ఇటీవల తనను కలిసేందుకు, శారీరక సుఖం పంచుకునేందుకు నిరాకరించసాగిందని, అందుకే తన స్నేహితునితో కలిసి హత్య చేసినట్లు వెల్లడించాడు. అయితే, హత్యకు ముందు.. ఆ యువతిపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేసి శవాన్ని నీటి కాలువలో పడేసినట్టు వెల్లడించారు. 
 
దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితులపై హత్యా, సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments