Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిని కిడ్నాప్ చేసి మత్తిచ్చి అత్యాచారం చేసిన బావ

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:53 IST)
యూపీ రాజధాని లక్నోలో మరో దారుణం జరిగింది. మరదిలిని కిడ్నాప్ చేసిన ఓ కామాంధుడు ఆమెకు మత్తుమందిచ్చి రెండు నెలలుగా అత్యాచారానికి తెగబడుతూ వచ్చాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్ జిల్లాలోని హ‌పూర్‌కు చెందిన నిందితుడికి ఆరేండ్ల కింద‌ట మీర‌ట్‌లోని లిసారి గేట్ ప్రాంతానికి చెందిన మ‌హిళ‌తో వివాహం జ‌రిగింది. కొన్నేండ్ల కింద‌ట ఇరువురి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో కొంత‌కాలంగా నిందితుడి భార్య పుట్టింట్లోనే ఉంటోంది. రెండు నెల‌ల కింద‌ట మ‌హిళ చెల్లెలు క‌నిపించ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇక‌ నిందితుడి చెర నుంచి త‌ప్పించుకుని ఇంటికి చేరుకుంది. తాను ప‌నిమీద బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో త‌న బావ మాయమాట‌లు చెప్పి తనను తీసుకువెళ్లాడ‌ని, మ‌త్తుమందు క‌లిపిన ఇంజ‌క్ష‌న్లు ఇచ్చి రెండు నెల‌లుగా లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని వివ‌రించింది. బాలిక‌ని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా ప‌రారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు ముమ్మ‌రం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం