Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు ఔరంగజేబు.. నేను షాజహాన్.. అతనిపై దండయాత్ర (పోటీ) చేస్తా : ములాయం

తన తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిప్పులు చెరిగారు. తన కుమారుడిని ఏకంగా ఔరంగజేబుతో పోల్చారు. పైగా, తనయుడిపై దండ్రయాత్ర (పోటీ) చేయనున్నట్టు ప్రకటించా

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (05:24 IST)
తన తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిప్పులు చెరిగారు. తన కుమారుడిని ఏకంగా ఔరంగజేబుతో పోల్చారు. పైగా, తనయుడిపై దండ్రయాత్ర (పోటీ) చేయనున్నట్టు ప్రకటించారు. 
 
సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు చివరికి పార్టీని నిట్టనిలువునా రెండుగా చీల్చిన విషయం తెల్సిందే. ఈ పరిణామ క్రమంలో ఆ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారథ్యంలో ఏర్పాటైన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ పరిణామంతో ములాయం సింగ్ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం కార్యకర్తలతో ములాయం భేటీ అయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైతే తన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌పై పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీని కాపాడేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తున్నా అఖిలేశ్‌ దాన్ని అర్థం చేసుకోవడం లేదని ములాయం విమర్శించారు. 
 
‘మూడు సార్లు అఖిలేశ్‌ను పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నించా. ఒక్క నిమిషం ఉండి నేను మాట్లాడటం ప్రారంభించగానే వెళ్లిపోయేవాడు’ అని ములాయం పార్టీ కార్యకర్తలకు తెలిపారు. అఖిలేశ్‌ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని, రాంగోపాల్‌ యాదవ్‌ చెప్పినట్లు ఆడుతున్నాడని ములాయం ఆరోపించారు. రాంగోపాల్‌ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని దుయ్యబట్టారు. 
 
రాష్ట్ర డీజీపీగా ముస్లింను నియమిస్తామని తాను హామీ ఇచ్చినప్పుడు అఖిలేశ్‌ 15 రోజులు తనతో మాట్లాడలేదన్నారు. అఖిలేశ్‌ ముస్లిం అభ్యర్థులు ఎవ్వరికీ టికెట్లు ఇవ్వడం లేదని, దీనికి రాంగోపాలే కారణమని ములాయం ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ కార్యకర్తల భేటీలో ములాయం తనను షాజహాన్‌గాను, అఖిలేశ్‌ను ఔరంగజేబుగాను అభివర్ణించి, ఆవేదన వ్యక్తం చేసినట్లు భేటీకి హాజరైన కొందరు నేతలు తెలిపారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments