Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తాం : మాయావతి జోస్యం

Webdunia
మంగళవారం, 15 జనవరి 2019 (16:02 IST)
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి జోస్యం చెప్పారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేసేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రమేనని ప్రకటించారు. 
 
సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ పొత్తుతో బీజేపీ నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తాము అతి పెద్ద విజయం సాధిస్తామని మాయావతి స్పష్టంచేశారు. అయితే, ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించేందుకు ఎస్పీ, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు.
 
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిస్తే ప్రధాని అభ్యర్థిని మనమే డిసైడ్ చేయొచ్చన్నారు. ఇది ఒక అవకాశం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలకు యూపీ ప్రజలు పెద్ద గుణపాఠమే చెప్తారన్నారు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేవలం బీజేపీకే కాకుండా కాంగ్రెస్‌కు కూడా గుణపాఠం నేర్పాయని మాయావతి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments