Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవు దూడను కాపాడబోయి... యూపీలో విషాదం

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (09:15 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. బావిలోపడిన ఓ ఆవుదూడను రక్షించబోయిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ మృతివార్త తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గోండా జిల్లాలోని రాజా మొహల్లాలో ఓ పాడు బావిలో ఓ ఆవుదూడ పడిపోయింది. దీనిని రక్షించే క్రమంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బావి పాడుబడటంతో గ్రామస్థులు దాంట్లో చెత్త వేసేవారు. 
 
ఈ బావిలో మంగళవారం ఓ లేగదూడ పడిపోయింది. గమనించిన ఓ వ్యక్తి దానిని రక్షించేందుకు నిచ్చెన వేసుకుని బావిలోకి దిగాడు. కిందికి దిగిన వ్యక్తి బావిలో వెలువడిన విషవాయువు పీల్చి స్పృహ కోల్పోయాడు. దీంతో ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు అందులో దిగిన మరో నలుగురు కూడా విషవాయువుల కారణంగా స్పృహతప్పిపోయారు.
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక, మునిసిపాలిటీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments