Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొందరెందుకు... ఏపీని ప్రత్యేక రాష్ట్రంగానే చూస్తున్నాం కదా : నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంగానే చూస్తున్నామనీ, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామంటూ తనను కలిసిన టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (13:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంగానే చూస్తున్నామనీ, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామంటూ తనను కలిసిన టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 
 
ఇటీవల పార్లమెంట్‌లో దాఖలు చేసిన వార్షిక బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేశారంటూ అధికార టీడీపీతో పాటు ఏపీ ప్రజలు అక్రోషిస్తున్న విషయం తెల్సిందే. దీంతో పార్లమెంట్ వేదికగా చేసుకుని టీడీపీ ఎంపీలు నిరసన, ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
 
అదేసమయంలో టీడీపీ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి కూడా ప్రధాని మోడీతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలతో పాటు ప్రజల మనోభావాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఏపీని ప్రత్యేక రాష్ట్రంగానే చూస్తున్నామనీ, ఏపీకి ఇచ్చిన అన్ని వాగ్ధానాల నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని అందువల్ల అన్ని విషయాలపై చర్చించుకుని పరిష్కరించుకుందామన్నారు. ఈ విషయాన్ని తన మాటగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పాలనీ, అవసరమైతే తానే బాబుతో మాట్లాడుతానని మంత్రి సుజనా చౌదరితో చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments