Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బారిన పడిన నితిన్ గడ్కరీ.. స్వల్ప లక్షణాలతో..?

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (13:06 IST)
ఇటీవలి కాలంలో కరోనా బారిన పడుతున్న మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల జాబితా పెరిగిపోతోంది. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కరోనా బారిన పడిన నేపథ్యంలో తాజాగా కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి.
 
"నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలున్నాయి. అన్ని ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ నాకు నేనుగా ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాను. హోం క్వారంటైన్‌లో ఉన్నాను. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారు ఐసోలేట్ అయ్యి టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.." అంటూ గడ్కరీ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి వారికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments