కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (15:43 IST)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విశ్వాంతి గదికి తరలించి, అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. ఆయన గురువారం నార్త్ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో రూ.1206 కోట్ల వ్యయంతో చేపట్టే జాతీయ రహదారుల నిర్మాణ శంకుస్థాపనల కోసం వెళ్లారు. అక్కడ వేదికపై ఉండగా ఆయన అస్వస్థతకు లోనయ్యారు. 
 
ఆ వెంటనే అధికారులు కార్యక్రమాన్ని నిలిపివేసి పక్కనే ఉన్న గ్రీన్ రూమ్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి సెలైన్ ఎక్కించారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినట్టు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత సిలిగురి నుంచి ఒక సీనియర్ వైద్యుడుని పిలిపించి వైద్యం చేశారు. 
 
ఆ తర్వాత డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా మంత్రి గడ్కరీని తన నివాసానికి తీసుకెళ్లారు. పిమ్మట మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేలా ఏర్పాట్లుచేశారు. ప్రత్యేక వైద్య బృందం ఎంపీ నివాసానికి చేరుకుని వైద్యం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments