Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో కూడా ఫేస్ బుక్ అంత పని చేసిందా?

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‍బుక్‌పై రోజురోజుకీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారుల సమాచార భద్రతా ఉల్లంఘనకు సంబంధించి ఇటీవలే అమెరికా కోర్టు ఆ సంస్థకు అక్షింతలు వేసింది. దీనిపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్పందిస్తూ వినియోగదారుల వి

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (12:00 IST)
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‍బుక్‌పై రోజురోజుకీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారుల సమాచార భద్రతా ఉల్లంఘనకు సంబంధించి ఇటీవలే అమెరికా కోర్టు ఆ సంస్థకు అక్షింతలు వేసింది. దీనిపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్పందిస్తూ వినియోగదారుల విశ్వాసానికి విఘాతం కలిగిన మాట వాస్తవేమని అంగీకరించి, ఇకపై అటువంటి ఉల్లంఘనలకు తమ సంస్థ పాల్పడదని హామీ ఇస్తూ క్షమాపణలు కూడా కోరుతున్నాడు.
 
అయితే భారత్‌లో కూడా ఇప్పుడు ఫేస్‌బుక్‌పై ఇలాంటి ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థ వినియోగదారుల సమాచారాన్ని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలతో పంచుకున్నట్లు కథనాలు రావడంతో, దీనిపై కేంద్రం స్పందిస్తూ ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో జూన్ 20 లోపు వివరణ ఇవ్వాలని ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. వినియోగదారుల నుండి ఎలాంటి అనుమతి పొందకుండానే వారి సమాచారాన్ని మొబైల్, ఇతర పరికరాల తయారీ సంస్థలకు పంచుకున్నట్లు ఆరోపించిన కథనాలు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో దీనిపై కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొంది.
 
దీనిపై ఫేస్‌బుక్ స్పందిస్తూ, వినియోగదారుల సమాచార భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, కేంద్ర ప్రభుత్వ సందేహాలకు సమాధానమిస్తామని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments