Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై వచ్చే తుఫానులన్నీ తీవ్ర ప్రభావం చూపుతాయి...

ఠాగూర్
ఆదివారం, 10 నవంబరు 2024 (13:08 IST)
ఇకపై వచ్చే తుఫానులన్నీ మరింతబలంగా ఉంటాయని కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సముద్రాలలో మరింత వడగాడ్పులు వెలువడనుండటంతో ఇకపై తుఫానులన్నీ బలంగా ఉంటూ తీరని నష్టాలను కలిగించే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. 
 
చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వ్యవస్థాపక దినోత్సవం శనివారం జరిగింది. ఇందులో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, రాబోయే రోజుల్లో తుఫానులన్నీ బలంగానే ఉంటాయని, ఉష్ణోగ్రత అధికంకావటం వల్ల మేఘాలన్నీ అధికంగా నీటిని మోసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయని, దీని ప్రభావంతో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయన్నారు. 
 
నెలల తరబడి ఈ మెరైన్ హీట్ వేవ్ కొనసాగుతుండటం వల్ల తుఫానులన్నీ ఇక మరింత బలంతో దూసుకువస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఓటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ రామకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీప్ ఓషన్ మిషన్‌లో భాగంగా లోతైన సముద్ర సూక్ష్మజీవులు, సముద్ర జీవులు సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్‌ను ఆయన ప్రారంభిం చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments