Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్... నిర్మలా సీతారామన్

ఠాగూర్
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (12:00 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఆమె బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వ సారి కావడం విశేషం.
 
ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని గురజాడ సూక్తితో ప్రారంభించారు. 'దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ అంటూ తెలుగ కవి గురజాడ అప్పారావు సూక్తిని తన తొలి వాక్యాల్లో ప్రస్తావించారు.
 
ఈ బడ్జెట్ ప్రసంగానికి ముందు విపక్షాలు తీవ్ర నిరసన తెలపడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చ కోరుతూ విపక్షాలు నిరసన తెలిపాయి. అనంతరం సభ నుంచి కొంతమంది వాకౌట్‌ చేశారు. ఈ పరిణామాల మధ్యే బడ్జెట్‌ ప్రసంగం సాగుతోంది.
 
అంతకుముందు బడ్జెట్‌ ట్యాబ్‌ను తీసుకుని ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ప్రథమ పౌరురాలి అనుమతి తీసుకుని పార్లమెంట్‌కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. అనంతరం వార్షిక పద్దును నిర్మలమ్మ సభకు సమర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments