Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుణ్య కోటాలో ఉద్యోగం కోసం... తండ్రిని చంపిన కొడుకు

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (17:36 IST)
కారుణ్య కోటలో ఉద్యోగం కోసం ఓ కన్నబిడ్డ తండ్రిని చంపేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. కారుణ్య‌ కోటాలో ఉద్యోగం పొందేందుకు ఓ కొడుకు త‌ల‌పెట్ట‌రాని చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా రామ్‌ (55) అనే వ్య‌క్తి రామ్‌గ‌ర్ జిల్లాలోని బ‌ర్కక‌నాలో గ‌ల‌ సెంట్ర‌ల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌(సీసీఎల్‌)లో సెక్యురిటీ గార్డుగా ప‌నిచేస్తున్నాడు. కాగా ఇత‌ను గ‌డిచిన‌ గురువారం అనుమానాస్ప‌ద‌రీతిలో మృతిచెందిప‌డి ఉన్నాడు.
 
అయితే, సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి వచ్చి సమాచారం సేకరించగా, గొంతు కోయ‌డంతో చ‌నిపోయిన‌ట్లుగా నిర్ధారించారు. ఈ విచార‌ణ‌లో కృష్ణారామ్ పెద్ద కొడుకు రామ్(35) హ‌త్య‌చేసిన‌ట్లుగా క‌నుగొన్నారు. చిన్న క‌త్తితో క్వార్ట‌ర్స్‌లోనే తండ్రి గొంతుకోసి చంపిన‌ట్లుగా తెలిపారు.
 
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు హ‌త్య‌కు ఉప‌యోగించిన క‌త్తి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగి అయిన రామ్‌ కారుణ్య కోటాలో ఉద్యోగం పొందేందుకు తండ్రిని హ‌త‌మార్చిన‌ట్లుగా పోలీసులు వెల్ల‌డించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments