Webdunia - Bharat's app for daily news and videos

Install App

విచారణ ఖైదీపై కిరోసిన్ పోసి తగలబెట్టిన జైలర్!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (16:23 IST)
బీహార్ రాష్ట్రంలో మరో ఘోరం చోటు చేసుకుంది. విచారణ ఖైదీని ఓ జైలర్ కిరోసిన్ పోసి నిలువునా తగులబెట్టేశాడు. రూపేష్ పాశ్వాన్ అనే వ్యక్తి ఆయుధాలు చట్టం కింద నాలుగేళ్లుగా నవడా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. రూపేష్ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడని పేర్కొంటూ 80 శాతం కాలిన గాయాలతో తొలుత నవాడా సదార్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సలహా మేరకు పాట్నా వైద్య కళాశాల ఆసుపత్రికి జైలు సిబ్బంది తరలించారు. 
 
అయితే, రూపేష్ పాశ్వాన్ మరణించే ముందు మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలమిస్తూ జైలులో నాణ్యమైన భోజనం పెట్టాలని గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నందుకు ప్రతీకారంగా జైలర్ లాల్ బాబూ సింగ్, అతడి సహచరులు గోపీ యాదవ్, బ్రహ్మ యాదవ్ తనపై కిరోసిన్ పోసి తగులబెట్టేశారని తెలిపి మరణించాడు. దీంతో మేజిస్ట్రేట్ ఆ విధంగానే వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ లాలన్ జీ స్పందిస్తూ.. ఖైదీ ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments