Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానంకోసం చిన్నారిని బలిచ్చిన ఓ మహిళ

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (15:46 IST)
ఓ మహిళ తన సంతానం కలగకపోవడంతో రెండేళ్ళ చిన్నారిని ఓ మహిళ బలిచ్చింది. పిల్లలు పుట్టకపోవడంతో మాంత్రికుడ్ని ఆశ్రయించిన ఆ మహిళ.... బాలుడి ప్రాణాల తీసింది. ఈ విషాదకర ఘటన ఢిల్లీలోజరిగింది.
 
రోషిణీ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల మహిళకు 2013లో వివాహమైంది. అయితే, ఆమెకు పిల్లలు కలగక పోవడంతో తోడికోడళ్లు, మెట్టింటి వారు హేళన చేయసాగారు. 
 
ఇది భరించలేక నాలుగేండ్ల కిందట పుట్టిల్లు అయిన ఉత్తరప్రదేశ్‌లోని హార్డోయిలో క్షుద్రపూజలు చేసే ఒక వ్యక్తిని ఆశ్రయించింది. సంతానం కలుగాలంటే ఒక చిన్నారిని బలి ఇవ్వాలని అతడు సూచించాడు.
 
ఈ నేపథ్యంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న ఆ మహిళ పొరుగున్న ఉన్న రెండున్నర ఏండ్ల బాలుడ్ని చంపాలని నిర్ణయించుకున్నది. శనివారం పక్క బిల్డింగ్‌ మేడపై ఒంటరిగా ఆడుకుంటున్నఆ చిన్నారి గొంతునులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఒక బ్యాగ్‌లో అక్కడ ఉంచింది.
 
మరోవైపు తమ కుమారుడు కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ చిన్నారి గురించి పోలీసులు ఆరా తీసి గాలించగా బిల్డింగ్‌ మేడపై ఒక బ్యాగ్‌ కనిపించింది. 
 
దానిని తెరిచిచూడగా బాలుడి మృతదేహం అందులో ఉన్నది. దీనిపై దర్యాప్తు చేయగా ఆ చిన్నారిని తానే చంపినట్లు ఆ మహిళ ఒప్పుకున్నది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments