అంగట్లో రూ.500కే యూజీసీ నెట్ ప్రశ్నపత్రం : వెల్లడించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్!

వరుణ్
శుక్రవారం, 21 జూన్ 2024 (14:36 IST)
యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ యేడాదికి రెండుసార్లు నిర్వహించే నెట్ ప్రశ్న పత్రాన్ని రూ.500కే అంగట్లో విక్రయించారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన వెల్లడించారు. అందుకే ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, డార్క్ నెట్‌లో, టెలిగ్రామ్‍‌లో పేపర్ షేరింగ్ అయినట్లు గుర్తించి, మరో మార్గంలేక పరీక్షను రద్దు చేసినట్లు వివరించారు. 
 
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలో పేపర్ లీక్ కావడం ఓ సంచలనం కాగా.. లీకైన పేపర్‌ను కేవలం రూ.500 లకే అమ్మారని, రూ.5 వేలకూ కొందరు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ప్రతి యేటా రెండుసార్లు నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష ద్వారా సమర్థులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లుగా ఎంపిక చేస్తారు. దీనికోసం పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు పోటీ పడుతుంటారు. 
 
ఈ ఏదాది నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. పేపర్ లీక్ జరిగిందని పలుచోట్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. తొలుత ఈ ఆరోపణలను కేంద్రం ఖండించింది.. అయితే, తర్వాత లీక్ నిజమేనని అంగీకరిస్తూ పరీక్ష రద్దు చేసింది.
 
అదేసమయంలో నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీకి సంబంధించి మంత్రిత్వ శాఖ బీహార్ పోలీసులతో ఎప్పటికప్పుడు టచ్ ఉందని చెప్పారు. ఈ ప్రశ్నపత్రం లీకేజీపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేసే ఆలోచన ఏదీ లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

రోషన్, అనస్వర రాజన్.. ఛాంపియన్ నుంచి గిర గిర గింగిరాగిరే సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments