Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాకు ఉద్ధవ్‌ ఠాక్రే వార్నింగ్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (23:23 IST)
తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి, నటి కంగనా రనౌత్‌కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా వ్యవహారంపై సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటుగా స్పందించారు.

తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం కరోనా కట్టడిపైనే ఉందని, రాజకీయాలపై ఇప్పుడేమీ మాట్లాడనని పేర్కొన్నారు. మహారాష్ట్రను అపఖ్యాతి పాలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని, సరైన సమయంలో దీనిపై స్పందిస్తానని అన్నారు. మహారాష్ట్రను బద్నాం చేయడానికి కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

వీటన్నింటిపై సరైన సమయంలో సిఎం ప్రొటోకాల్‌ పక్కన పెట్టి మరీ స్పందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గిందని, ఈ నెల 15 నుంచి 'నా కుటుంబం - నా బాధ్యత' కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.

ఇందులో భాగంగా వైద్యులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తారని తెలిపారు. ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments